లక్నో: ఇండియా డబుల్స్ షట్లర్లు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రన్నరప్తో సరిపెట్టారు. టైటిల్పై ఆశలు రేపిన ఈ ఇద్దరు ఫైనల్లో పోరాడి ఓడారు. ఆదివారం జరిగిన విమెన్స్ డబుల్స్ ఫైనల్లో 32వ ర్యాంకర్ అశ్విని–క్రాస్టో 14–21, 21–17, 15–21తో మూడో సీడ్స్ రిన్ ఇవానగ–కియో నకానిషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది.
77 నిమిషాల పాటు సాగిన టైటిల్ ఫైట్లో ఏడో సీడ్ ఇండియా జోడీ ఆటను మెరుగ్గా ఆరంభించినా తర్వాత ఒత్తిడికి గురై తొలి గేమ్ కోల్పోయింది. రెండో గేమ్లో గెలిచి మ్యాచ్లో నిలిచిన అశ్విని, క్రాస్టో మూడో గేమ్లో 1–8తో వెనుకబడినా అద్భుతంగా పుంజుకున్నారు. వరుస పాయింట్లతో 13–15తో రేసులోకి వచ్చారు. కానీ, చివర్లో పట్టుదలగా ఆడిన జపాన్ షట్లర్లు గేమ్తో పాటు మ్యాచ్ కూడా నెగ్గారు.