హోటల్ లో బస చేసి..సామాన్లు లూటీ చేశారు

హోటల్ లో బస చేసి..సామాన్లు లూటీ చేశారు

ఫారెన్ వెళ్లిన ఇండియన్ ఫ్యామిలీ  హోటల్ లో ఉండటానికి రూమ్ ఇస్తే..ఆ రూమ్ లో ఉన్న వస్తువులనే లూటీ చేసి దొరికి పోయి నవ్వుల పాలైయ్యింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మన ఇండియా పరువు తీశారంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇండియా కు చెందిన ఓ కుటుంబం బాలి దీవుల టూర్ కు వెళ్లింది. అక్కడ నైట్ హోటల్ రూమ్ లో ఉన్నారు. వెళ్లేటప్పుడు ఆ రూమ్ లో ఉన్న వస్తువులను బ్యాగ్ లో సర్దుకుని బయల్దేరారు. ఈ విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది వారిని అడ్డుకుని చెక్ చేశారు. దీంతో వారి బ్యాగులో నుంచి వస్తువులు బయటపడ్డాయి. దీన్ని  ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్లో  పోస్ట్ చేశాడు. దీనికి అలాంటి వాళ్లకు రూమ్ ఇవ్వొద్దని ఒకరు..మన దేశం పరువు తీశారని మరొకరు పలువురు పలు కామెంట్లు పెడుతున్నారు.