40 రోజుల లాక్ డౌన్ .. రూ.5.50 లక్షల కోట్ల నష్టం

40 రోజుల లాక్ డౌన్ .. రూ.5.50 లక్షల కోట్ల నష్టం

న్యూఢిల్లీ: కరోనా వల్ల రిటైల్‌‌ సెక్టార్‌‌కు మునుపెన్నడూ లేనన్ని నష్టాలు వస్తున్నాయని కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆలిండియా ట్రేడర్స్‌‌ (సీఏఐటీ) పేర్కొంది. ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్‌‌ 30 వరకు విధించిన లాక్‌‌డౌన్‌‌ వల్ల రిటైల్‌‌ వ్యాపారరంగానికి రూ.5.5 లక్షల కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించింది. మనదేశంలోని 20 శాతం మంది రిటైలర్లు షాపులను శాశ్వతంగా మూసివేసే ప్రమాదం ఉందని ఆందోళన ప్రకటించింది. తమ రంగాన్ని బతికించడానికి వీలైనంత వెంటనే ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌‌కు సీఏఐటీ లెటర్‌‌ రాసింది. ఏడు కోట్ల రిటైల్‌‌ ట్రేడర్లు ఉన్న 40 వేల వ్యాపార సంఘాలతో సీఏఐటీను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌‌ రిటైల్‌‌రంగాన్ని కోలుకోలేని దెబ్బకొట్టిందని, ప్రభుత్వ సాయం లేకుండా ఈ నష్టాల నుంచి బయటపడటం అసాధ్యమని స్పష్టం చేసింది. ‘‘మనదేశంలో ఏడు కోట్ల రిటైల్‌‌ షాపులు ఉన్నాయి. వీరిలో 1.5 కోట్ల మంది ట్రేడర్లు మరికొన్ని నెలల్లోపే తమ షాపులను మూసుకునే పరిస్థితులు ఉన్నాయి. వీరిపై ఆధారపడి వ్యాపారం చేసే మరో 75 లక్షల మంది వ్యాపారులు షటర్లకు తాళాలు వేయడం తప్పకపోవచ్చు’’ అని సీఏఐటీ నాయకుడు ఒకరు వివరించారు.

ప్రభుత్వాలు పట్టించుకోవాలి…

రిటైల్‌‌ సెక్టార్‌‌ను నిలబెట్టడానికి ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని సీఏఐటీకి చెందిన మరో నాయకుడు విమర్శించారు. ‘‘నాన్‌‌ కార్పొరేట్‌‌ సెక్టార్‌‌ బాగు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ సాయం ప్రకటించలేదు. మనదేశం జీడీపీలో రిటైల్‌‌ సెక్టార్‌‌ వాటా 40 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు ఉద్యోగుల్లో మూడింట ఒకవంతు రిటైల్‌‌ సెక్టార్‌‌లోనే పనిచేస్తారు. వర్కర్లు అందరికీ తప్పనిసరిగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది కానీ బ్యాంకులు మాత్రం యథావిధిగా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. బిల్డింగ్‌‌ ఓనర్లు కిరాయి కట్టాలంటూ బలవంతం చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు. లాక్‌‌డౌన్‌‌ కొనసాగుతున్నప్పటికీ లిక్కర్‌‌ షాపులు తెరవడాన్ని సీఏఐటీ తప్పుబట్టింది. నలభై రోజులపాటు విధించిన లాక్‌‌డౌన్‌‌తో తగ్గిన కరోనా కేసులు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

గ్లోబల్‌‌ రిటైల్‌‌కు 2.1 ట్రిలియన్‌‌ డాలర్లు లాస్‌‌

కరోనా వల్ల షాపులను మూసేయడం, వినియోగదారుల కొనుగోళ్లు తగ్గడం వల్ల గ్లోబల్‌‌గా రిటైల్‌‌ సెక్టార్‌‌కు ఈ ఏడాది 2.1 లక్షల డాలర్ల నష్టం వస్తుందని తాజా స్టడీ వెల్లడించింది. ఈ నష్టం నుంచి బయటపడటానికి రిటైలర్లకు కనీసం నాలుగేళ్లు పడుతుందని న్యూ ఫారెస్టర్‌‌ రిపోర్ట్‌‌ తెలిపింది.  ముఖ్యంగా ఇండియా, జపాన్‌‌ దేశాల రిటైలర్లు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించింది. వైరస్‌‌ ప్రభావం మరో ఏడు నెలల వరకు ఉండొచ్చని, ఆ తరువాత కూడా అమ్మకాలు ఆశించినట్టుగా ఉండవని స్పష్టం చేసింది. నాన్‌‌–ఎసెన్షియల్ వస్తువుల అమ్మకాలు మరీ తక్కువగా ఉంటాయని ఫారెస్టర్‌‌ వివరించింది

టాటా మోటార్స్​ ఎన్సీడీలు

నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్ల ద్వారా రూ.వెయ్యి కోట్లు సమీకరించేందుకు టాటా మోటార్స్‌ బోర్డు ఓకే చెప్పింది.

ఉచితంగా జీ5 కంటెంట్​

ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ కస్టమర్లకు జూలై 12 వరకు   కంటెం ట్‌ను జీ5 ఉచితంగా అందించనుంది.

హోల్డ్​లో 4జీ టవర్ల టెండర్​
రూ. 9,000 కోట్ల విలువైన 4జీ టవర్ల టెండర్‌‌ను హోల్డ్‌ లో ఉంచాలని డీపీఐఐటీ  బీఎస్‌ఎన్‌ ఎల్‌ను కోరింది.విదేశీ కంపెనీలకు మేలు చేసేలా కాంట్రాక్టు ఉందని ఆరోపణలు  వచ్చాయి
మ్యాక్స్​ బూపా సీఎండీ కృష్ణణ్​
మ్యాక్స్‌ బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓగా కృష్ణన్‌ రామచంద్రన్‌ బాధ్యతలు తీసుకున్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగంలో ఆయనకు అపార అనుభవం ఉండటం
వల్లే ఈ పోస్టు కట్టెబెట్టామని కంపెనీ తెలిపింది.

 వివో స్మార్ట్​ రిటైల్​
మొబైల్‌ ఫోన్‌ కంపెనీ వివో  ‘వివో స్మార్ట్‌ రిటైల్‌’ను మొదలుపెట్టింది. దీనివల్ల కస్టమర్లు ఇంటి నుంచై రిటైల్‌ స్టోర్ల స్టాఫ్‌తో మాట్లాడి డివైజ్‌ల వివరాలు తీసుకోవచ్చు.   ఫోన్‌ను కొనుక్కోవచ్చు.