
కలబురగి: ఇండియా టెన్నిస్ స్టార్ రామ్కుమార్ రామనాథన్ తన కెరీర్లో మూడో ఐటీఎఫ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఐటీఎఫ్ కలబురగి ఓపెన్ టోర్నీ మెన్స్ సింగిల్స్లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రామ్ కుమార్6–2, 6–1తో ఆస్ట్రియాకు చెందిన డేవిడ్ పిచ్లెర్ను వరుస సెట్లలో ఓడించాడు.
గత వారమే రామ్కుమార్ ఐటీఎఫ్ ముంబై ఓపెన్ నెగ్గాడు. తాజా విక్టరీతో అతను 25 ఏటీపీ పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు.