విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్

విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ, విదేశీ ప్రయాణాలకు తక్కువ ధరకే విమాన టికెట్లు అందిస్తామని ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ శుక్రవారం (23)నుంచి ఆదివారం (25) వరకు అందుబాటులో ఉంటుదని స్పష్టం చేసింది. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణానికి రూ.4,999ల నుంచి టికెట్ ధరలు ప్రారంభమవుతాయని ఇండిగో తెలిపింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రయాణించేందుకు ఈ ఆఫర్ వర్తిస్తుంది ఇండిగో చెప్పింది.

ఇండిగో ప్రకటించిన ఈ స్పెషల్ డిస్కౌంట్ మిగతా ఏ ఆఫర్, కూపన్, ప్రమోషన్లకు వర్తించదు, టికెట్లు అందుబాటులో ఉన్నంత వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అయితే హెచ్‌ఎస్‌బీసీ కస్టమర్లు మాత్రం అదనంగా కొంత డిస్కౌంట్ పొందొచ్చు. ఇండిగో సంస్థ కార్యకలాపాలు పుంజుకోవడంతో దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకే ఈ ఆఫర్ పెట్టినట్టు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. ఆ కంపెనీకి మొత్తం 290 విమానాలు ఉండగా, రోజుకు 1,600 సర్వీస్ లు నడుపుతోంది.