
పాలకుర్తి/ తొర్రూరు, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ క్యాంటీన్లను ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల ప్రజా పరిషత్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వనిత మహిళా శక్తి క్యాంటీన్ను ఎమ్మెల్యే కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే తొర్రూరులో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ వేడుకలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ సాయిలు, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ నడిగడ్డ శ్రీనివాస్ తో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.