
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ఏర్పాటు కోసం భూసర్వే కొనసాగుతోంది. భూసేకరణకు అంగీకరించిన రైతుల భూముల్లో సర్వే ప్రక్రియ జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం లగచర్ల, హకీంపేట గ్రామాల్లో దాదాపు 85 ఎకరాల పట్టా భూముల్లో అధికారులు సర్వే చేశారు. ఇది వరకు అధికారులపై జరిగిన దాడి ఘటనలు దృష్టిలో ఉంచుకుని భారీ పోలీసు బందోబస్తు మధ్య దుద్యాల తహసీల్దార్ కిషన్ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించారు.
పట్టా భూములకు ఎకరాకు రూ. 23లక్షలు, 150 గజాల ప్లాట్, ఇంటికి రెండు ఉద్యోగాలను ప్రభుత్వం పరిహారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భూముల సర్వే పూర్తయిన తర్వాత, ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొని, రైతులకు పరిహారం అందించనుంది.