
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ 5,88,743 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో 24 గేట్లను 15 అడుగులు, 2 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 5,45,884 క్యూసెక్కుల నీటిని డ్యామ్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 585.80 అడుగులు(299.7430 టీఎంసీలు)కు చేరింది. కుడి కాల్వకు 8,529, హైదరాబాద్ జంట నగరాల తాగునీటికి ఏఎమ్మార్పీకి 2,400, వరద కాల్వకు 300, విద్యుత్ ఉత్పత్తికి 33, 130 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. - హాలియా, వెలుగు