ఫాక్స్​కాన్​ నిర్ణయం ఎఫెక్ట్​ ఉండదు.. ఐటీ మినిస్టర్ ​రాజీవ్ చంద్రశేఖర్​​

ఫాక్స్​కాన్​ నిర్ణయం ఎఫెక్ట్​ ఉండదు..  ఐటీ మినిస్టర్ ​రాజీవ్ చంద్రశేఖర్​​

న్యూఢిల్లీ: వేదాంత జాయింట్​ వెంచర్​ నుంచి వైదొలగాలనే ఫాక్స్​కాన్​ నిర్ణయం మన సెమికండక్టర్​ ఫ్యాబ్రికేషన్​ గోల్​పై ఎఫెక్ట్​ చూపించదని ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మినిస్టర్​ రాజీవ్​ చంద్రశేఖర్​ వెల్లడించారు. రెండు ప్రైవేటు కంపెనీల మధ్య వ్యవహారంలో ప్రభుత్వానికి ఏమీ సంబంధం ఉండదని చెబుతూ, ఇండియా మార్కెట్లో ఇప్పుడు ఆ రెండు కంపెనీలు.. దేనికది సొంతంగా ఏమి చేయొచ్చో, ఎలా చేయొచ్చో ఆలోచించుకోవచ్చని అన్నారు. 

పై రెండు కంపెనీలకు సెమికండక్టర్​ రంగంలో ముందస్తు అనుభం లేదని, వేరొకరి దగ్గర టెక్నాలజీ తెచ్చుకుందామనుకున్నాయని పేర్కొన్నారు. జాయింట్​ వెంచర్​ కంపెనీ 28ఎన్​ఎం ఫ్యాబ్​ కోసం ప్రపోజల్​ ఇచ్చాయని, కానీ అందుకవసరమైన టెక్నాలజీ పార్ట్​నర్​ వాటికి దొరకలేదని రాజీవ్​ చంద్రశేఖర్​ వివరించారు. జాయింట్​ వెంచర్​ కంపెనీ ద్వారానే వేదాంత 40 ఎన్​ఎం ఫ్యాబ్​ కోసం కొత్త ప్రపోజల్​ ఇచ్చిందని, దీనిని పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. జాయింట్​ వెంచర్​ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించిన ఫాక్స్​కాన్​, కారణాలేవిటనేది మాత్రం బయటకు చెప్పలేదు.