పేదరికం చదువుకు అడ్డుకావొద్దని వివిధ చేయూత కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ విద్యా సంస్థల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్)లో ఉన్నత విద్యా అభ్యసించాలనుకుంటున్న ఆర్థికంగా బలహీన వర్గాల్లోని విద్యార్థినులకు స్టెమ్స్టార్స్ స్కాలర్షిప్స్ ఇచ్చేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది.
ఫస్ట్ఫేజ్లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కాలేజీల్లో సీట్లు పొందిన 2 వేల మంది అమ్మాయిలకు నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ అందినవ్వనుంది. హాస్టల్, స్టడీ మెటీరియల్స్, ట్యూషన్ ఫీజులు తదితర ఖర్చుల కోసం ఏటా రూ.లక్ష వరకు వీరికి ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇన్ఫీ పేర్కొంది.
దేశంలో పేదరికంలో ఉన్న యువత తాము కోరుకున్న హైయర్ ఎడ్యుకేషన్ చదవలేకపోతున్నారని.. ఈ ప్రభావం బాలికలపై ఎక్కువంగా ఉందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రీస్టీ సుమిత్ విర్మానీ తెలిపారు.
ఫస్ట్ఇయర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్గుర్తింపు ఉన్న విద్యాలయాలు అంటే ఐఐటీలు, బిట్స్ పిలానీ, నిట్, ప్రసిద్ధ మెడికల్ కాలేజీల్లో చదివే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది.