
- నలుగురు ఖైదీలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: చర్లపల్లి జైలులో కొందరు ఖైదీలు గంజాయి కోసం గొడవకు దిగారు. జైలు సిబ్బందిపైనా దాడి చేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా, గొడవకు దిగిన నలుగురు ఖైదీలను అధికారులు అదుపులోకి తీసుకొని వేరే బ్యారెక్స్లోకి తరలించారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ కొంతమంది అండర్ ట్రయల్ ఖైదీలను ఇటీవల చంచల్ గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అందులో గంజాయికి అడిక్ట్ అయిన వారు కూడా ఉన్నారు. చర్లపల్లి జైలులో సాధారణ ఖైదీలతో వారిని రిమాండ్ చేశారు. గంజాయికి అలవాటుపడ్డ వారు తమకు గంజాయి కావాలని చాలాసార్లు జైలు సిబ్బందితో గొడవపడ్డారు. బ్యారక్లో ఉన్న మిగతా ఖైదీలతోనూ వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ ఘటనపై చర్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి విచారణ జరుపుతున్నారు.