కరెంట్ షాక్ కొట్టి ఇంటర్ విద్యార్థి మృతి..జనగామ జిల్లా గోపాల్ నగర్ లో ప్రమాదం

కరెంట్ షాక్ కొట్టి ఇంటర్ విద్యార్థి మృతి..జనగామ జిల్లా గోపాల్ నగర్ లో ప్రమాదం

బచ్చన్నపేట,వెలుగు:  కరెంట్ షాక్ కొట్టి ఇంటర్ విద్యార్థి చనిపోయిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ లోని ముషీరాబాద్​కు చెందిన ఎండీ అలీ, అలియాబేగం దంపతులు తమ కొడుకు ఎండీ అసద్​(17) తో కలిసి రెండు రోజుల కింద బచ్చన్నపేటలోని బంధువుల ఇంట్లో జరిగే పెండ్లికి వచ్చారు.  గురువారం సాయంత్రం బచ్చన్నపేట పక్కనే ఉండే  గోపాల్​నగర్​లోని మేనమామ ఎండీ జమాల్ ఇంటికి అసద్ వెళ్లాడు. స్నానం చేసేందుకు బాత్రూమ్ లో నీళ్లు రాకపోవడంతో చూసేందుకు ఇంటిపైన వాటర్​ట్యాంక్​పైకి ఎక్కాడు.

 పైనుంచి వెళ్లే ఎల్​టీ 11కేవీ లైన్ తీగలు తలకు తగలడంతో అసాద్​ కరెంట్ షాక్ కొట్టి కిందపడి చనిపోయాడు. బచ్చన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం  జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్​ లైన్ కింద వాటర్​ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రాణాలు పోయేందుకు కారణమైన జమాల్​పై పోలీసులు కేసు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గోపాల్​నగర్ లో మరో ఇరవై మంది ఇండ్లపై నుంచి ఎల్టీ లైన్​కరెంటు తీగలు వెళ్తుండగా.. వాటిని తొలగించాలని విద్యుత్ అధికారులను అడిగితే.. రూ. 3.22లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని పలువురు ఆరోపించారు.