న్యూఢిల్లీ/ముంబై: జూన్ మూడో వారం లేదా చివరి వారం నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్సర్వీసెస్ ప్రారంభించే అవకాశం ఉందని సివిల్ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఆరోగ్య సేతు అప్లికేషన్ లో గ్రీన్స్టేటస్ఉన్న డొమెస్టిక్ఎయిర్ ప్యాసింజర్లను క్వారంటైన్లో ఎందుకు ఉంచాలో అర్థం కావట్లేదన్నారు. ‘పరిస్థితులు మెరుగుపడితే ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు వెయిట్ చేయడం ఎందుకు? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్నీ రెడీగా ఉన్న తర్వాత జూన్ మధ్య నుంచి జులై చివరి వరకు ఎప్పుడైనా స్టార్ట్ చేయచ్చు’ అని అన్నారు.
‘ఆరోగ్య సేతు’ తప్పనిసరి కాదు
ఫ్లైట్లో ప్రయాణించేందుకు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి కాదని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్యాసింజర్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇవ్వాల్సి ఉంటుందని, థర్మల్ స్క్రీనింగ్ తప్పకుండా చేయించుకోవాలన్నారు. వాష్రూమ్స్, గాలిని శుభ్రపరిచేందుకు స్పెషల్ శానిటేషన్ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రాంతాలలో తక్కువ సిబ్బంది ఉంటారని చెప్పారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మార్చి 25 నుంచి ఫ్లైట్ల రాకపోకలను నిలిపేశారు.
‘రేపట్నుంచి మా రాష్ట్రంలో సర్వీసులుండవ్’
సోమవారం నుంచి విమాన సర్వీసులు నడపడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మహారాష్ట్ర సర్కార్ చెప్పింది. ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమలులో ఉన్నందు వల్ల అప్పటివరకు ఫ్లైట్ ఆపరేషన్లు ఉండవని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఎయిర్ ట్రావెల్కు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ (ఎస్ఓపీ) పై నిర్ణయం తీసుకోవడానికి తమకు కొంత సమయం అవసరమని సర్కార్ భావిస్తోంది.
లాక్ డౌన్ ఎఫెక్ట్.స్మార్ట్ ఫోన్ గేమింగ్ కు మరింత జోష్