లారీ చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

లారీ చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

జనగామ అర్బన్, వెలుగు: అంతర్​రాష్ట్ర దొంగలను జనగామ పోలీసులు అరెస్ట్​ చేశారు. మహారాష్ట్రలోని నాగ్​పూర్​జిల్లా వర్ధమాన్​నగర్​కు చెందిన నందకిశోర్​ సుఖ్​చంద్​కాక్రే ఈజీగా డబ్బు సంపాదించేందుకు లారీలను చోరీ చేసి అమ్ముతున్నాడు. ఈ క్రమంలో గత నెల మూడో వారంలో జనగామ మండలం వడ్లకొండ వద్ద నయారా పెట్రోల్​బంకు వద్ద పార్క్​చేసిన లారీని నందకిశోర్ చోరీ చేసి మధ్యప్రదేశ్​లోని ఇండోర్​కు చెందిన సల్మాన్​ మన్సూరీకి రూ. 2 లక్షలకు అమ్మాడు. వడ్లకొండకు చెందిన ఓనర్ గొరిగే మహేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 మంగళవారం ఉదయం 10.30 గంటలకు నందకిషోర్, సల్మాన్​పెంబర్తికి వచ్చారు. అక్కడి పెట్రోల్​బంకు వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్, జనగామ సీఐ దామోదర్​రెడ్డి, ఎస్ఐలు భరత్, చెన్నకేశవులు,  కానిస్టేబుల్స్ ను వరంగల్​ సీపీ అభినందించిన్టటు  జనగామ ఏసీపీ చేతన్​ నితిన్​ తెలిపారు.