రిప్లబిక్ డే పరేడ్​కు క్రీడాకారిణికి ఆహ్వానం

రిప్లబిక్ డే పరేడ్​కు క్రీడాకారిణికి ఆహ్వానం

కోల్​బెల్ట్, వెలుగు: ఈనెల 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్​డే పరేడ్​కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా హ్యాండ్​బాల్​నేషనల్​క్రీడాకారిణి తుమ్రమ్​సత్యభామను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించారని ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ బాధ్యులు శ్యాంసుందర్​రావు, కనపర్తి రమేశ్ తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతం కెరమెరికి చెందిన క్రీడాకారిణికి ఆహ్వానం రావడం గర్వంగా ఉందన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు.