న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఇండియన్ఆయిల్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్లో ఐఓసీ రూ.1,660.15 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లను ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఈ జాయింట్ వెంచర్ను ఈ ఏడాది జూన్లో 50: 50 భాగస్వామ్యం కింద ఇరు కంపెనీలు ఏర్పాటు చేశాయి.
తన వంతుగా రూ.1,660 కోట్లను ఐఓసీ ఇన్వెస్ట్ చేసింది. ‘ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సోలార్ పీవీ, విండ్, ఇతర రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంది. ఇండియన్ ఆయిల్ రిఫైనరీలకు 24 గంటల పాటు ఎటువంటి కరెంట్ కోత ఉండకుండా చూసేందుకు ఈ పవర్ ప్రాజెక్టులు పనిచేస్తాయి’ అని ఐఓసీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.