న్యూఢిల్లీ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జూన్ క్వార్టర్లో రూ. 13,750 కోట్ల నికర లాభంతో మార్కెట్ అంచనాలను మించింది. అంతకు ముందు క్వార్టర్తో పోలిస్తే నికర లాభం 37 శాతం ఎగసింది. మరోవైపు రెవెన్యూ మాత్రం 2.36 శాతం తగ్గి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. కంపెనీ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ తాజా క్వార్టర్లో మెరుగుపడింది. ఈ క్వార్టర్లో ఇబిటా 44.5 శాతం పెరిగి రూ. 22,163 కోట్లకు చేరడమే దీనికి నిదర్శనం. ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో యావరేజ్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎం) బ్యారెల్కు 8.34 డాలర్లుగా ఉందని ఐఓసీ వెల్లడించింది.
అంతకు ముందు ఏడాది అంటే జూన్ 2022 క్వార్టర్లో కంపెనీకి రూ. 1,992 కోట్ల నష్టం వచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్వార్టర్లో ఐఓసీ రెవెన్యూ రూ. 2.51 లక్షల కోట్లు. జూన్ 2023 క్వార్టర్లో పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇబిటా రూ. 18,720 కోట్లకు పెరగ్గా, పెట్కెమ్ ఇబిటా మాత్రం రూ. 88 కోట్లకు పడిపోయిందని ఐఓసీ తెలిపింది. రిజల్ట్స్ ప్రకటన నేపథ్యంలో ఐఓసీ షేరు శుక్రవారం సెషన్లో 3.5 శాతం నష్టపోయింది.