15న యాపిల్​ ఐఫోన్​ ఎస్​ఈ2 లాంచ్

15న యాపిల్​ ఐఫోన్​ ఎస్​ఈ2 లాంచ్

ప్రముఖ స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ యాపిల్ తన కొత్త బడ్జెట్​ ఫోన్​ ఐఫోన్​ ఎస్​ఈ2(ఐఫోన్ 9)ను మార్కెట్​లోకి లాంచ్​ చేయనుంది. ఈ నెల 15న దీనిని అఫీషియల్​గా మార్కెట్​లోకి తీసుకురానుంది. వాస్తవానికి మార్చి 31నే ఐఫోన్​ ఎస్​ఈ2ను రిలీజ్​ చేయాల్సి ఉన్నా.. కరోనా ఎఫెక్ట్​ కారణంగా.. ఏప్రిల్​ 3వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు 15వ తేదీన రిలీజ్​ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఐఫోన్​ ఎస్​ఈ2 వార్తల్లో నిలుస్తోంది. దీని లీక్డ్​ ఫొటోలు, ఫీచర్ల వివరాలు తరచుగా మీడియాలో కనిపిస్తూ వచ్చాయి. 2016లో ఐఫోన్​ ఎస్​ఈకి అప్​డేట్​ వెర్షనే ఇది. 4.7 ఇంచెస్​ ఎల్ సీడీ డిస్ ప్లే సైజుల్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు 399 డాలర్లు(రూ.30,400). 2016లో ఎస్​ఈని రిలీజ్​ చేసినప్పుడు దాని రేటు కూడా దాదాపు ఇంతే ఉంది. సిల్వర్, గోల్డ్​, గ్రే కలర్స్​లో అందుబాటులోకి రానుంది. ఏ13 బయోనిక్​ చిప్​సెట్​ను వాడనున్నారు. 3జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీవీ వేరియంట్లలో లభించనుంది. అయితే ఇండియాలో ఈ ఫోన్​ ఎప్పటి నుంచి లభిస్తుందనే సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదు.