ఐపీఎల్‌‌ వేలానికి 333 మంది ప్లేయర్లు

ఐపీఎల్‌‌ వేలానికి 333 మంది ప్లేయర్లు

న్యూఢిల్లీ :  ఇండియా పేసర్లు శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్   ఐపీఎల్‌‌ 2024 వేలంలో అత్యధికంగా రూ. రెండు కోట్ల బేస్‌‌ప్రైజ్‌‌లో బరిలో నిలిచారు.  ఈ నెల 19న దుబాయ్‌‌లో జరిగే వేలం కోసం రిజిస్టర్ అయిన 1166 మంది ప్లేయర్ల నుంచి ఫ్రాంచైజీలు ఆసక్తి చూసిన మొత్తం 333 మంది క్రికెటర్లను ఐపీఎల్‌‌ గవర్నింగ్ కౌన్సిల్ సోమవారం షార్ట్ లిస్ట్ చేసింది.

ఇందులో 214 మంది ఇండియన్స్, 119 మంది ఫారిన్ ప్లేయర్లు, ఇద్దరు అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. పది జట్లలో కలిసి ఖాళీగా  ఉన్న 77 స్థానాల కోసం వీరు పోటీ పడనున్నారు. ఇందులో 30 బెర్తులు ఫారిన్ ప్లేయర్లవి. రెండు కోట్ల బేస్‌‌ప్రైజ్‌‌లో  23 మంది ఆటగాళ్లు ఉండగా, రూ. 1.5 కోట్ల  ధరతో 13 మంది ఆటగాళ్లు వేలం తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. వేలంలో పది ఫ్రాంచైజీలు మొత్తంగా రూ. 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి.