రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాత మారేనా?.. ఉప్పల్‌‌‌‌‌‌‌‌లో నేడు పంజాబ్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌

రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాత మారేనా?.. ఉప్పల్‌‌‌‌‌‌‌‌లో నేడు పంజాబ్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వరుసగా రెండు ఓటములతో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌16ను ఆరంభించిన సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సొంతగడ్డపై మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయింది. ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో  ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌తో తలపడనుంది. మూడో పోరులో అయినా గెలుపు బాట పట్టాలని ఆశిస్తోంది. అది జరగాలంటే ముందుగా రైజర్స్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌ అవ్వాలి. గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. 

ముఖ్యంగా టాపార్డర్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లోనే వరుసగా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేరడం కలవరపెడుతోంది. గత పోరులో డకౌటైన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఐడెన్‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ ఉప్పల్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపించాలి. భారీ అంచనాలున్న బ్రూక్‌‌‌‌‌‌‌‌ తడబడుతున్న నేపథ్యంలో హిట్టర్‌‌‌‌‌‌‌‌ హెన్రిచ్‌‌‌‌‌‌‌‌ క్లాసెన్‌‌‌‌‌‌‌‌ను తుది జట్టులోకి తీసుకుంటారేమో చూడాలి.  మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు నెగ్గి జోరుమీదున్న పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌  హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ విక్టరీపై కన్నేసింది. ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవాలంటే రైజర్స్‌‌‌‌‌‌‌‌ అన్నింటా సత్తా చాటాలి.