రేస్లో యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా
ముందుకొస్తున్న ఇంగ్లండ్ కౌంటీలు
సెప్టెంబర్లో మిగతా లీగ్కు ఓకే
బీసీసీఐ నిర్ణయం కోసం వెయిటింగ్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఈ ఏడాది చివర్లో కంప్లీట్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నిర్ణయానికి లీగ్ గవర్నింగ్ కౌన్సిల్, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్స్, ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా పూర్తి మద్దతు పలుకుతున్నారు. ఇంతవరకు ఓకే ఉన్నా.. ఒకవేళ లీగ్ను కొనసాగించాలంటే... ఎప్పుడు? ఎక్కడ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు లభించకపోయినా.. కొన్ని ఈక్వేషన్స్ అయితే బీసీసీఐ మదిలో ఉన్నాయి. వాటికి అనుగుణంగా బోర్డు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందోమో చూడాలి.
ఇండియాలో కష్టమే..
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ ఏడాది మొత్తంలో ఐపీఎల్ పేజ్–2 మ్యాచ్లను ఇండియాలో నిర్వహించడం కష్టమే. విండో లభించినా, బయో బబుల్ను మరింత పొటెన్షియల్గా మార్చినా.. కరోనా కేసులు పెరుగుతున్న టైమ్లో మళ్లీ మ్యాచ్లంటే ప్రతి ఒక్కరూ విమర్శలకు దిగుతారు. ఒకవేళ కరోనా సిచ్యువేషన్ బాగా మెరుగుపడితే అప్పుడు ట్రై చేయొచ్చు. కానీ ఇప్పట్లో అది కష్టంగానే కనిపిస్తున్నది. దీనికితోడు స్వదేశాలకు వెళ్లిపోయిన ఫారిన్ క్రికెటర్లు మళ్లీ ఇండియాకు రావడానికి ఇష్టపడకపోవచ్చు. ఓవర్సీస్ క్రికెటర్లు లేకుంటే ఐపీఎల్ కళ తప్పుతుంది. ముస్తాక్ అలీ టీ20 టోర్నీ మాదిరిగా అయిపోతుంది. అప్పుడు లీగ్కు ఉన్న ప్రతిష్ట మసకబారుతుంది. కాబట్టి ఇండియాలో ఇప్పటికిప్పుడు లీగ్ అంటే కష్టమే. ‘ఈ సిచ్యువేషన్లో ఇండియాలో లీగ్ను కొనసాగించడం కష్టమే. కానీ ఓవర్సీస్లో మ్యాచ్లకు ఒకటి, రెండు ప్రపోజల్స్ వచ్చాయి. వాటికి అనుగుణంగా బీసీసీఐ రెడీ అయిపోతే సరిపోతుంది’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ బోర్డు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే బీసీసీఐ ముందు మూడు అప్షన్లు ఉన్నాయి.
మళ్లీ యూఈఏకి తరలించడం.
ఇప్పటికే ఓసారి మెగాలీగ్కు సక్సెస్ఫుల్గా ఆతిథ్యమిచ్చిన ప్లేస్ ఇది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇండియాలో టీ20 వరల్డ్కప్ కూడా కష్టమేనని సందేహాలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ముందు ఐపీఎల్, ఆ తర్వాత టీ20 వరల్డ్కప్.. ఇలా రెండింటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. సెప్టెంబర్ 14తో ఇంగ్లండ్లో ఇండియా టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచే నేరుగా యూఏఈ వెళ్లి ఓ వారం పాటు క్వారంటైన్లో ఉంటే సరిపోతుంది. అక్టోబర్ 22న వరల్డ్కప్ స్టార్ట్ అయ్యే వరకు మిగతా 31 ఐపీఎల్ మ్యాచ్లను పూర్తి చేసుకోవచ్చు. ‘వరల్డ్కప్ను కూడా యూఏఈకి షిఫ్ట్ చేస్తే.. షెడ్యూల్ను కంప్లీట్ మార్చేయాల్సిందే’ అని సదరు అధికారి పేర్కొన్నాడు. అయితే అరబ్ గడ్డపై సెప్టెంబర్లో ఐపీఎల్ను కొనసాగించడానికి ఉన్న ఒకే సమస్య.. వెదర్. ఆ నెలలో అక్కడ బాగా వేడిగా ఉంటుంది. అక్టోబర్ నుంచి కూల్గా ఉంటుంది.
యూకేకు తీసుకెళ్లడం
టీ20 వరల్డ్కప్ను యూఏఈకి షిఫ్ట్ చేస్తే.. ఐపీఎల్కు యూకే అత్యంత అనువైన ప్లేస్. సరిగ్గా సెప్టెంబర్తో ఇంగ్లిష్ సమ్మర్ ముగుస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ఐపీఎల్ను పూర్తి చేసుకోవచ్చు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ కోసం ఇండియా ఎలాగూ వచ్చే నెల ఇంగ్లండ్ వెళ్తుంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఆ వెంటనే ఐపీఎల్ను కంప్లీట్ చేసుకుని వరల్డ్కప్ కోసం యూఏఈకి వెళ్తే సరిపోతుంది. ‘ఆ టైమ్లో వెదర్ కూడా బాగుంటుంది. బ్రాడ్కాస్టర్స్కు కూడా అనువైన టైమ్ లభిస్తుంది. ఓవర్సీస్ ప్లేయర్ల ట్రావెలింగ్కు కూడా మంచి టైమ్ లభిస్తుంది. ప్లేయర్లు కూడా ఇంగ్లండ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్కడి నుంచి ప్లేయర్లందరూ నేరుగా యూఏఈకి వెళ్తారు’అని ఆ అధికారి తెలిపారు.
ఆసీస్లో ట్రై చేయడం..
ఒకవేళ టీ20 వరల్డ్కప్ను ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరిస్తే, అదే టైమ్లో ఆసీస్ గవర్నమెంట్ రూల్స్ను సడలిస్తే.. రెండు టోర్నీలను కంగారూల గడ్డపై ఏర్పాటు చేయొచ్చు. ఆసీస్లో జరగాల్సిన 2022 టీ20 వరల్డ్కప్ను ఇండియాలో నిర్వహిస్తే సరిపోతుంది. ‘ఆసీస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఎక్స్చేంజ్కు క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దగా ఇబ్బందిపెట్టకపోవచ్చు. ఎలాగూ ఇంటర్నేషనల్ ప్లేయర్లందరూ ఆసీస్కు వస్తారు. ఇండియన్ టైమింగ్కు పెర్త్ మూడున్నర గంటలు ముందుంటుంది. కాబట్టి ఇండియన్ ప్రైమ్ టైమ్లోనే ఐపీఎల్ మ్యాచ్లను కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఆసీస్ గవర్నమెంట్ రూల్స్ ను సడలించి, బ్రాడ్కాస్టర్స్ ఒప్పుకుంటేనే ఈ ఆప్షన్ పనికొస్తుంది’ అని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కొత్త డెస్టినేషన్లో లీగ్ను నిర్వహించడం వల్ల ఫ్రెష్నెస్తో పాటు వ్యూయర్షిప్ను కూడా పెంచుకునే చాన్స్ ఉంటుందని ఇండస్ర్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రకంగా చూస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పాయి.
ఐపీఎల్–14 వాయిదా పడి మూడు రోజులు కూడా కాలేదు..! చాలా మంది ఫారిన్, ఇండియా క్రికెటర్లు ఇంకా ఇళ్లకు కూడా చేరలేదు..! కానీ అప్పుడే సెకండ్ పేజ్ మ్యాచ్ ల నిర్వహణపై చర్చ మొదలైంది..! కరోనా నేపథ్యంలో ఇండియాలో లీగ్ను కొనసాగించడం కష్టమని తేలడంతో.. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా రేస్లోకి వచ్చేశాయ్..! కాసులు కురిపించే లీగ్ కావడంతో ఇంగ్లిష్ కౌంటీలు కూడా హోస్టింగ్స్కు మొగ్గు చూపుతున్నాయి..! అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్లో విండో దొరుకుతుందని ఆశాభావంతో ఉన్న బీసీసీఐకి ఇది ఓ రకంగా బూస్టింగ్ ఇచ్చే అంశమే అయినా.. మెగా లీగ్ ఫ్యూచర్ను బోర్డు ఎలా డిసైడ్ చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది..!!
ఎంసీసీ, సర్రే, వార్విక్షైర్, లాంక్షైర్ క్లబ్స్ ఆఫర్..
లార్డ్స్ స్టేడియం బేస్గా ఉన్న ఇంగ్లిష్ కౌంటీలు ఎంసీసీ, సర్రే, వార్విక్షైర్, లాంక్షైర్ కూడా ఐపీఎల్ హోస్టింగ్ ఆఫర్ ఇచ్చాయి. కియా ఓవల్ (లండన్), ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), ఎమిరైట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్) గ్రౌండ్స్ వీళ్ల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ మేరకు నాలుగు కౌంటీలు ఈసీబీకి లెటర్ రాశాయి. సెప్టెంబర్ సెకండ్ వీక్లో ఐపీఎల్ను కంప్లీట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. టీ20 వరల్డ్కప్కు ముందు టాప్ క్లాస్ క్రికెటర్లకు ఈ లీగ్ ఉపయోగపడుతుందని కౌంటీస్ వెల్లడించాయి.