సారూ.. తాగునీరు ఇప్పియ్యరూ.. ఇప్పలపల్లె గ్రామంలో రోడ్డెక్కిన గ్రామస్తులు

సారూ.. తాగునీరు ఇప్పియ్యరూ.. ఇప్పలపల్లె గ్రామంలో రోడ్డెక్కిన గ్రామస్తులు

మొగుళ్లపల్లి, వెలుగు : జయశంకర్​భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లె గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమయ్యింది. బోరింగుల్లోనూ నీరు రాకపోవడంతో ఆదివారం గ్రామస్తులు రోడ్డెక్కారు. బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించాలని ఇటీవల తహసీల్దార్, ఎంపీడీవో, విలేజ్​ సెక్రటరీలకు కంప్లైంట్​ చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ధర్మసమాజ పార్టీ లీడర్లు పాల్గొన్నారు. ​