ఇజ్రాయెల్ అంతు చూస్తాం..అడ్డువస్తే అమెరికాను వదలం..ఖమేనీ మాస్ వార్నింగ్

ఇజ్రాయెల్ అంతు చూస్తాం..అడ్డువస్తే అమెరికాను వదలం..ఖమేనీ మాస్ వార్నింగ్

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా జోక్యంతో మిడిల్ ఈస్ట్లో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి.  ఇరాన్ పై అమెరికా సైనిక చర్య తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ. ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్ పై దాడి చేస్తే..ఇరాన్ పై సైనిక చర్యలుంటాయని అమెరికా హెచ్చరించిన కొద్ది గంటల్లో ఇరాన్ సుప్రీం ఖమేనీ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 

ఇరాన్ ఒత్తిడికి తలొగ్గదని ప్రకటించిన ఖమేనీ.. ఇటీవల దాడులతో ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని అన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు శిక్ష తప్పదని అన్నారు. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసింది. ఇజ్రాయెల్ పాలకులపై ఎట్టి పరిస్థితుల్లో దయచూపం..శిక్ష అనుభవించి తీరాల్సిందే అన్నట్లుగా ఓ టెలివిజన్ ప్రసంగంలో ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. 

ఇరాన్ బేషరతుగా  లొంగిపోవాలని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ వ్యాఖ్యలు చేయడంలో మిడిల్ ఈస్ట్ లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. మూడో ప్రపంచం యుద్దం తప్పదన్నట్లు కనిపిస్తున్నాయి అక్కడి పరిస్థితులు. 

ఇరాన్ లొంగిపోవాలని వార్నింగ్ ఇచ్చిన తర్వాత ట్రంప్ కు ఖమేనీ వాషింగ్టన్ కు గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్ పై ఏదైనా దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. సైనిక వివాదంలో అమెరికా పాల్గొంటే అమెరికా తీవ్ర నష్టం చవి చూడాల్సి వస్తుందని ఖమేనీ హెచ్చరించారు. 

ఇరాన్ పై ఇజ్రాయెల్ దురాక్రమణను ఖమేనీ తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు రెడీగా ఉన్నాయని, జియోనిస్ట్ పాలకులు తమ   గగన తలాన్ని ఉల్లంఘిండాన్ని, ఇరాన్  లో  రక్తపాతాన్ని క్షమించదు, మరిచిపోదు అని ఖమేనీ ప్రతిజ్ణ చేశారు.

ఇరాన్‌తో చర్చలు లేవు: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

మరోవైపు ఇరాన్ తన లక్ష్యాలను సాధించే వరకు ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను కొనసాగిస్తుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌తో చర్చలు ఉండవు అని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో స్పందించిన ఇజ్రాకెల్ రక్షణ మంత్రి..టెహ్రాన్ నాశనమవుతుంది. ప్రభుత్వ చిహ్నాలు, బ్రాడ్ కాస్టింగ్ అథారిటీలు, భవనాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నాం.. ఇరాన్ ప్రజలు గుంపులుగా పారిపోతున్నారు.. ఇరాన్ నియంతృత్వ సౌధాలు కూలిపోతున్నాయి’’ అంటే కాట్జ్ రాశారు. 

►ALSO READ | ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మన భారతీయుడేనా..?: యూపీ నుంచి వెళ్లిన పూర్వీకుల కుటుంబం

మరోవైపు ఆదివారం టెల్ అవీవ్ లో జరిగిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడిలో 9మంది చనిపోయారు. డజన్లకొద్దీ మందీ గాయపడ్డారు. ఇరాన్ తో ఎటువంటి చర్చలు లేదు.. లక్ష్యం సాధించేవరకు రైజింగ్ లయన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి విదేశీ దౌత్యవేత్తలకు చెప్పారు. 

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు..అమెరికా జోక్యంతో మిడిల్ ఈస్ట్లో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ పై దాడి చేస్తే..ఇరాన్ పై సైనిక చర్యలుంటాయని అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లో ఇరాన్ సుప్రీం ఖమేనీ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ ఎప్పుడూ లొంగిపోదు..ఇజ్రాయెల్ కు సహకరిస్తే అమెరికాకు కూడా తీవ్ర నష్టం చవిచూడాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.