మిడ్ మానేరుకు రెండు టీఎంసీలు ..గాయత్రి పంపు హౌస్ నుంచి ఎత్తిపోస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు

మిడ్ మానేరుకు రెండు టీఎంసీలు ..గాయత్రి పంపు హౌస్ నుంచి ఎత్తిపోస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు

రామడుగు, వెలుగు:  ఎల్లంపల్లి నుంచి  గాయత్రి పంపుహౌస్​ ద్వారా శనివారం వరకు రెండు టీఎంసీల నీటిని మిడ్ ​మానేర్​కు ఎత్తిపోసినట్లు ఇరిగేషన్​ ఆఫీసర్లు తెలిపారు. ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 12,600 క్యూసెక్కుల నీరు నంది మేడారానికి వస్తుండగా, అంతే నీరు 4 పంపుల ద్వారా ఎత్తి పోస్తుండగా గాయత్రి పంపుహౌస్​కు చేరుతున్నాయి.  ఆ నీటిని బాహుబలి మోటార్ల ద్వారా   వరద కాల్వకు, అక్కడ్నుంచి షానగర్​ శివారులోని జంక్షన్ ​పాయింట్​నుంచి మిడ్ ​మానేరుకు తరలిస్తున్నారు.

 గాయత్రి పంపుహౌస్ ​నుంచి  శనివారం 1,2,4,5,6 బాహుబలి మోటార్ల ద్వారా సుమారు 1.3 టీఎంసీల నీటిని మిడ్​మానేర్​కు తరలించినట్లు డీఈ రాంప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం 4వ నంబర్​బాహుబలి మోటార్​ను ఆపేసి 1, 2, 5, 6 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు వివరించారు.