టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్..తన హోంగ్రౌండ్ రాంచీ స్టేడియంలో సందడి చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ గెలిచిన తర్వాత..ఫ్యాన్స్ను పలకరించాడు. స్టాండ్స్లో తిరుగుతూ అభిమానులతో సెల్ఫీలు దిగాడు. మరోవైపు ఓ అభిమాని ఇషాన్ కిషన్ కు లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ను శార్దూల్ ఠాకూర్కు ఇవ్వాలని కోరాడు. అందులో శార్దూల్ ఠాకూర్ 54 పేరుతో లవ్ సింబల్ ఉంది. ఈ లెటర్ను ఇషాన్ కెమెరాకు చూపించాడు. ఇషాన్ కిషన్ సందడి చేసిన ఈ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. దేశవాలీ క్రికెట్లో ఇషాన్ జార్ఖండ్ తరఫున ఆడాడు. ఇషాన్ బిహార్ వాసి అయినప్పటికీ.. రాంచీ స్టేడియంతో అతనికి మంచి అనుబంధం ఉంది.
మిస్ చేసుకున్నా..
రెండో వన్డేలో ఇషాన్ కిషన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 84 బంతుల్లోనే 93 పరుగులు చేసిన అతను..ఇమాద్ ఫోర్టుయిన్ బౌలింగ్లో ఔటయ్యాడు. మ్యాచ్ అనంతరం..మాట్లాడిన ఇషాన్..తాను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిమానులు సెంచరీ చేయాలని కోరినట్లు తెలిపాడు. సెంచరీ చేసేందుకు ప్రయత్నించానని..కానీ దురదృష్టవశాత్తూ..మిస్ చేసుకున్నానని చెప్పాడు. సెంచరీ మిస్ అయినా...మ్యాచ్లో గెలిచినందుకు ఆనందంగా ఉందన్నాడు. చివరి వన్డేలో మరోసారి రాణించేందుకు ప్రయత్నిస్తానని..జట్టును గెలిపించేందుకు అవసరమైన పరుగులు చేస్తానని చెప్పాడు.