నేనంటే లెక్క లేదా మీకు:ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం

నేనంటే లెక్క లేదా మీకు:ఇజ్రాయెల్పై  ట్రంప్ ఆగ్రహం

నేనంటే మీకు లెక్కలేదా.. నేను చెప్పిన తర్వాత కూడా మీరు గీత దాటుతారా.. నేను ఏం చెప్పాను.. మీరు ఏం చేస్తున్నారు.. కాల్పుల విరమణకు ఒప్పుకుని ఇప్పుడు మళ్లీ బాంబులు వేసుకుంటారా అంటూ ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఆ దేశంపై ట్రంప్ చిందులు తొక్కారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు నేను ప్రకటించాను..నా మాట కాదని..నా ఆదేశాలు లెక్కచేయకుండా..మళ్లీ యుద్ధం ఎలా చేస్తారు అంటూ ఇజ్రాయెల్ పై మండిపడ్డారు ట్రంప్.

ఇజ్రాయెల్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కాల్పుల విమరణను ఉల్లంఘించి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇజ్రాయెల్ వెంటనే తన పైలట్లను వెనక్కి పిలిపించాలి.. లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ ద్వారా తెలిపారు. 

ఇజ్రాయెల్‌ తీరు ఏం బాగాలేదు..కాల్పుల విరమణ అమలు తర్వాత ఇజ్రాయెల్ నుంచి క్షిపణి ప్రయోగం జరిగింది. ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే ఇజ్రాయెల్ దాడులు నాకు నచ్చలేదు. ఇరు దేశాలు శాంతించాలి అని ట్రంప్ అన్నారు. చాలా కాలంగా రెండు దేశాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆ రెండు దేశాలు ఏం చేస్తు్న్నాయో వారికి తెలియడంలేదు. అన్నారు ట్రంప్. 

ఇరాన్ ,ఇజ్రాయెల్ మధ్య మంగళవారం ఉదయం కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.. ఇదే విషయాన్ని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దీంతో ట్రంప్ ఆదేశానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇరాన్ పై దాడులనుఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్ క్షిపణిని మాత్రమే తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. తాజా దాడులను టెహ్రాన్ ఖండించింది.