
మిడిల్ ఈస్ట్ లో హై టెన్షన్ వాతావరణం మొదలైంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిస్సైళ్ల వర్షం స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. అణుబాంబులు కలిగిన ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దళాలు శుక్రవారం (జూన్ 13) తెల్లవాఝామున ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మిస్సైళ్ల వర్షం కురిపించాయి. టెహ్రాన్ ప్రాంతంలో భారీగా పేళ్లులు సంభవించాయని ఇరాన్ మీడియా ప్రకటించింది. ఇరాన్ లోని డజన్లకొద్ది న్యూక్లియర్ సైట్లు, మిలిటరీ బేసిన్ లను టార్గెట్ చేస్తూ దాడులు జరిగినట్లు ఇరాన్ మిలిటరీ అధికారి ప్రకటించారు. న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేసినా.. కేవలం కొన్ని రోజుల్లోనే కనీసం 15 అణుబాంబులను తయారు చేసుకునే సత్తా తమకు ఉందని ఆయన హెచ్చరించారు
ఇరన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిందని ఇద్దరు అమెరికా అధికారులు కూడా కన్ఫామ్ చేశారు. అయితే ఈ దాడికి అమెరికాకు సంబంధం లేదని తెలిపారు. దాడులు వద్దని అమెరికా హెచ్చరించినా ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలకు పాల్పడినట్లు తెలిపారు.
దాడులపై ఇరాన్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కట్జ్ తెలిపారు. ఏ సమయంలోనైనా ఇరాన్ దాడులు జరపవచ్చునని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్స్ తో దాడి చేస్తుందని, తిప్పికొట్టేందుకు ఆర్మీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
యుద్ధం మొదలైన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మీ అధికారులతో మంతనాలు జరిపారు. ఇరాన్ దాడులకు దిగితే ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో చర్చించారు. యుద్ధం మొదలైనట్లుగా ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరెన్ లు మోగించారు అధికారులు.