
- దానికి రక్షణగా పెట్టిన షీట్ ఫైల్స్అట్లనే వదిలేసిన్రు
- మెయింటనెన్స్ను పట్టించుకోలే.. కనీస జాగ్రత్తలు తీసుకోలే
- ఫలితంగా భారీ నష్టం.. ప్రశార్థకంగా ప్రాజెక్టు ఉనికి
- ఇదే అంశంపై ఇరిగేషన్సర్కిల్స్లో జోరుగా చర్చ
- పదికి పైగా పిల్లర్లను పూర్తిగా తొలగించి మళ్లీ కట్టాల్సిందే..
- అందుకు సుమారు రూ.650 కోట్ల ఖర్చు!
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ కుంగుబాటుకు అంతులేని నిర్లక్ష్యమే కారణమనే చర్చ ఇరిగేషన్ సర్కిల్స్లో జోరుగా సాగుతున్నది. బ్యారేజీతో పాటు ప్రధాన పంప్హౌస్కన్నెపల్లిని త్వరగా పూర్తి చేయడం, ప్రారంభించడంపై చూపించిన శ్రద్ధను నిర్వహణలో చూపించకపోవడంతోనే నాలుగేండ్లకే బ్యారేజీ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని ఇంజనీర్లు చెప్తున్నారు. పొరపాట్లు, నిర్లక్ష్యమే ఇప్పుడు వందల కోట్ల రూపాయల నష్టానికి కారణంగా మారుతున్నాయని, ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాయని అనుమానిస్తున్నారు. బ్యారేజీ నిర్మించిన వర్క్ఏజెన్సీతో పాటు ఫీల్డ్ఇంజనీర్లు కనీస జాగ్రత్తలు తీసుకోకవడంతోనే మేడిగడ్డ ఏడో బ్లాక్కుంగిందని.. ఆ ప్రభావం ఆరు, ఎనిమిది బ్లాకులపైనా పడిందని ఇరిగేషన్ఇంజనీర్లు, రిటైర్డ్ఇంజనీర్లు భావిస్తున్నారు. బ్యారేజీ నిర్మించడానికి ముందు కట్టిన కాఫర్డ్యామ్పూర్తిగా తొలగించకపోవడం, దానికి దిగువన ఏర్పాటు చేసిన షీట్ఫైల్స్ను అలాగే వదిలేయడంతోనే ఏడో బ్లాక్లో అండర్మైనింగ్జరిగి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినట్లు చెప్తున్నారు. ఈ విషయం అధికారికంగా బయటపెట్టకపోయినా.. ఆఫ్ది రికార్డుగా ప్రస్తావిస్తున్నారు. సాంకేతిక కారణాలతో బ్యారేజీ కుంగినట్టు కొత్త ప్రభుత్వానికి చెప్తూ తమ తప్పు ఏమీలేదని బుకాయించేందుకు ఫీల్డ్ఇంజనీర్లతో పాటు వర్క్ఏజెన్సీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇసుక కొట్టుకుపోయి..!
మేడిగడ్డ బ్యారేజీ నిర్మించడానికి ముందు గోదావరి నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు నదిలో కాఫర్డ్యాం కట్టారు. గోదావరి ప్రవాహ తీవ్రతకు కాఫర్డ్యాం దెబ్బతినకుండా ఉండేందుకు నదిలో 5 మీటర్ల లోతు నుంచి కాఫర్డ్యాం దిగువన షీట్ఫైల్స్ఏర్పాటు చేశారు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత కాఫర్డ్యాంను పూర్తిగా తొలగించలేదు. ముఖ్యంగా పిల్లర్కుంగిపోయిన ఏడో బ్లాక్కు ఎగువన కాఫర్డ్యాంను అలాగే వదిలేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదో బ్లాక్లో కాఫర్డ్యాం కింద ఏర్పాటు చేసిన షీట్ఫైల్స్ను అలాగే వదిలేశారు. దీంతో గోదావరి ప్రవాహానికి అవి అడ్డు తగిలి ఇంకా ఎక్కువ తీవ్రతతో బ్యారేజీ ముందు భాగాన్ని వరద తాకిందని, ఆ కారణంగానే సికెంట్ఫైల్స్ఫెయిలై ఫౌండేషన్కింద అండర్ మైనింగ్అయి ఇసుక కొట్టుకుపోయిందని ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించకపోవడం.. కాఫర్డ్యాం, షీట్ఫైల్స్చేసే నష్టాన్ని సరిగా అంచనా వేయకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఏడో బ్లాక్లో 20వ నంబర్పిల్లర్ఎందుకు కుంగిందో ఇన్వెస్టిగేట్చేయడానికి కాఫర్డ్యాం నిర్మిస్తున్నారు. పాత కాఫర్డ్యాంపైనే కొత్త అప్రోచ్రోడ్డు కం కొత్త కాఫర్డ్యాం కడ్తున్నారు. ముఖ్యంగా 18 నుంచి 20వ నంబర్పిల్లర్లకు ఎగువన పాత కాఫర్డ్యాం ఎక్కువ ఎత్తులోనే కనిపిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీలోని ఆరు నుంచి ఎనిమిది బ్లాకులు మహారాష్ట్ర భూభాగంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఇసుక తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదని.. అందుకే కాఫర్డ్యాం తొలగించలేదని కొందరు ఫీల్డ్ ఇంజనీర్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బ్యారేజీలో పేరుకుపోయిన ఇసుక తొలగించడం వేరు.. బ్యారేజీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కాఫర్డ్యాంను తొలగించడం వేరే అనే లాజిక్మరిచి ఇంజనీర్లు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని డిపార్ట్మెంట్లోనే చర్చ జరుగుతున్నది.
మిగతా పిల్లర్లలోనూ పగుళ్లు
బ్యారేజీ మిగతా బ్లాకుల్లోని కొన్ని ప్రాంతాల్లో పాత కాపర్డ్యాం ఆనవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మేడిగడ్డ వైఫల్యాలపై పవర్పాయింట్ప్రజంటేషన్లో మూడు పిల్లర్లు, రేడియల్గేట్లు, స్లాబ్, వాక్వే బ్రిడ్జి సహా అన్నింటిని తొలగించి కొత్తగా నిర్మిస్తామని ఇరిగేషన్ఈఎన్సీ చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బ్యారేజీలోని ఏడో బ్లాక్లో గల 16వ నంబర్నుంచి 21వ నంబర్పిల్లర్వరకు దెబ్బతిన్నాయి. 20వ నంబర్పిల్లర్1.25 మీటర్లు కుంగడంతో దానిలో పగుళ్లు ఏర్పడ్డాయి. మిగతా పిల్లర్లలోనూ చిన్నపాటి పగుళ్లు ఉన్నాయి. ఏడో బ్లాక్కు ఇరువైపులా ఉన్న ఆరు, ఎనిమిదో బ్లాకుల్లోని కొన్ని పిల్లర్లు దెబ్బతిన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నా తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా పదికి పైగా పిల్లర్లను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని, ఇందుకు సుమారు రూ.650 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్వహణలో కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకొని, ఏటా దెబ్బతిన్న ఆప్రాన్లు సహా ఇతర మైనర్రిపేర్లు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఇంజనీర్లు చెప్తున్నారు. ఇందులో వర్క్ఏజెన్సీ నిర్లక్ష్యం ఎంత ఉందో ఫీల్డ్ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం అంతకన్నా ఎక్కువే ఉందని అంటున్నారు. బ్యారేజీ పునరుద్ధరించడం ఎంత ముఖ్యమో.. దాని నిర్వహణపై శ్రద్ధ తీసుకోవడం అంతకన్నా ముఖ్యమని, ఆ దిశగా కొత్త ప్రభుత్వమైన దృష్టి సారించాలని సూచిస్తున్నారు.