5వ జాతీయ ఆరోగ్య సర్వే నివేదికలో వెల్లడి
తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ఒబేసిటీ సమస్య
పట్నం-పల్లె మధ్య తగ్గిపోతున్న తేడా
శ్రమకు మించి తినేవాళ్లు పెరిగిపోతున్నారు
‘తిండి కలిగితె కండకలదోయ్’ అన్నాడు గురజాడ. అయితే మనవాళ్లు కండలు పెంచే తిండి కాకుండా కొవ్వు పెంచే తిండి తింటున్నారిప్పుడు. ఆ తిండితో గట్టిమేల్ తలపెట్టే ఓపిక లేకపోగా రోగాలబారిన పడుతున్నారు. ఇది ఎవరో అన్న ఉత్తమాట కాదు. ‘నేషనల్ హెల్త్ సర్వే’ చెప్పిన గట్టిమాట. తెలంగాణలో ఏటా ఒబెసిటీ ప్రాబ్లమ్తోపాటు రక్త హీనతతో బాధపడుతున్నవాళ్లు పెరుగుతున్నారని లెక్కగట్టి చెబుతున్నది.
మొన్ననే కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన 5వ నేషనల్ హెల్త్ సర్వే రిపోర్ట్ తెలంగాణలో ఒబెసిటీ సమస్య పెరుగుతున్నదని తేల్చి చెప్పింది. చేసే పనికి మించిన తిండి తినడం ఒక సమస్య అయితే, తినే తిండి కూడా ఒంట్లో కొవ్వు పెంచేదే కావడంతో ఈ సమస్య ఎక్కువవుతోంది. తెలంగాణలో 19 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు వాళ్లలో ఈ సమస్య గత సర్వే (4వ నేషనల్ హెల్త్ సర్వే) లెక్కల కంటే ఎక్కువగా ఉంది. తాజా నివేదిక ప్రకారం తెలంగాణ ఆడవాళ్లలో 44.1 శాతం మంది ఒబెసిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్లలో 46.1 శాతం మంది ఒబెసిటీ బారినపడ్డారు. ఒబెసిటీ సమస్య అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దాదాపు సమానంగా ఉంది. అర్బన్ మహిళల్లలో 47.5 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతుంటే, రూరల్లో ఉండే మహిళల్లో 42.3 శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్లలో కూడా పట్నం, పల్లె అనే తేడా తగ్గిపోయినట్లుంది. అర్బన్ ఏరియాలో ఉండే మగవాళ్లలో 47.6 శాతం మంది ఒబెసిటీతో ఇబ్బంది పడుతుంటే రూరల్ ఏరియాలో ఉండేవాళ్లలో 45.3 శాతం మంది ఈ సమస్యతో ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం కూర్చుని ఉండే పనులు చేసేవాళ్లు, పని చేయని వాళ్లు, శ్రమకు మించి తినేవాళ్లు పల్లెల్లో కూడా పెరిగిపోతున్నారని అర్థమవుతోంది.
కండలు పెంచే తిండి కాదు.. కొవ్వు పెంచే తిండి తింటున్నారు
- లైఫ్
- December 21, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
- హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
- కేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
- బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
- దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్కుమార్రెడ్డి
- Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు