ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..టాప్ షూటర్ ఇంటిపై ఐటీ దాడులు

ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..టాప్ షూటర్ ఇంటిపై ఐటీ దాడులు

ముంబై మాజీ పోలీస్ ఆఫీసర్.. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్.. టాప్ షూటర్ ప్రదీప్ శర్మ ఇంటిపై గురువారం (ఫిబ్రవరి 8) ఐటీ అధికారులు దాడులు చేశారు. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ప్రదీప్ శర్మ నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. పన్ను ఎగవేత కేసులో ప్రదీప్ శర్మ ఇంటిపై ఈ దాడులు జరిగాయి. ప్రదీప్ శర్మ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు ఉంది. సంచలనం రేపిన మన్సూఖ్ హిరేన్ హత్య కేసులో ప్రదీప్ శర్మ ఇంతకుముందు పోలీసులు అరెస్ట్ చేశారు. 

2021 ఫిబ్రవరి 25న అంబానీ కుటుంబానికి ప్రాణహానీ, జిలెటిన్ స్టిక్ ఉంచి అంటిల్లా భవనానికి సమీపంలో పార్క్ చేసిన SUV వాహనం ఓనర్ మన్సూఖ్ హిరేన్. 2023 మార్చి 5 న థానే క్రీక్ వద్ద మన్సూఖ్ ను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. ఈ కేసును విచారించిన ఎన్ ఐఏ.. జూన్ 2021లో నిందితుడిగా ప్రదీప్ శర్మను అరెస్ట్ చేసింది. 

మరోవైపు శర్మ ఇంటితో పాటు మహారాష్ట్ర ఎమ్మెల్యే , బిజినెస్ మ్యాన్ ఘనశ్యామ్ దుబే ఇంటిని కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. గతేడాది (2023) నకిలీ పత్రాలతో భూమిని ఆక్రమించాడని ఉత్తర ప్రదేశ్ పోలీసులు దుబేను అరెస్ట్ చేశారు.