ఇక్సిగో 1,296 కోట్ల సేకరణ.. ప్రోసస్‌‌‌‌‌‌‌‌కు 10.1 శాతం వాటా అమ్మకం

ఇక్సిగో 1,296 కోట్ల సేకరణ.. ప్రోసస్‌‌‌‌‌‌‌‌కు 10.1 శాతం వాటా అమ్మకం

న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ కంపెనీ ఇక్సిగో,  ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ  ప్రోసస్ నుంచి రూ.1,296 కోట్లు సమీకరించనుంది.  ప్రిఫరెన్షియల్ షేర్ల ఇష్యూ ద్వారా ఈ డీల్ జరుగుతుంది. ఇక్సిగో తన 10.1శాతం వాటాను ఎంఐహెచ్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ బీవీ (ప్రోసస్)కు రూ.280 షేర్ ధర వద్ద విక్రయించనుంది. 

ఈ నిధులను కంపెనీ ఆర్గానిక్, ఇనార్గానిక్ వృద్ధి, వర్కింగ్ క్యాపిటల్,  కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తామని ఇక్సిగో పేర్కొంది. ఈ కంపెనీ  2024 జూన్‌‌‌‌‌‌‌‌లో రూ.93 షేర్ ధరతో మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లిస్టయ్యింది. 

ప్రోసస్ ఇప్పటివరకు  8.6 బిలియన్ డాలర్లను ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది. ఈ-–కామర్స్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ రంగాల్లో పెట్టుబడి పెట్టింది.