
చేర్యాల, వెలుగు: రెవెన్యూ డివిజన్సాధనే లక్ష్యంగా జేఏసీ ముందుకెళ్తుందని కమిటీ చైర్మన్పరమేశ్వర్ అన్నారు. గురువారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్విద్యా సంస్థలను కలిసి కరపత్రాలను అందజేసి 12న జరిగే బంద్కు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్మాట్లాడుతూ.. బంద్ కు అందరూ సహకరించి రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి ఊపిరి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట జేఏసీ నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ..
చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జేఏసీ చైర్మన్ నర్సయ్య పంతులు ఆధ్వర్యంలో ధూల్మిట్ట మండలంలోని గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా వీర బైరాన్పల్లి గ్రామంలోని అమరవీరుల బురుజు వద్ద నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించింది. అనంతరం ధూల్మిట్ట తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.