శభాష్.. కలెక్టర్ రిజ్వాన్..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందిస్తూ ఎక్స్ లో పోస్ట్

శభాష్.. కలెక్టర్ రిజ్వాన్..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందిస్తూ ఎక్స్ లో పోస్ట్
  • విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల్లో జనగామ రికార్డ్​  
  • దేశంలోని టాప్​ 50 జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో మొదటిది

జనగామ, వెలుగు : విద్యార్థుల అభ్యసనా సామర్థ్యపు పోటీల్లో దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్​50 జిల్లాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జనగామకు చోటు దక్కడంతో కలెక్టర్ ను శభాష్ అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. గురువారం సీఎం తన ఎక్స్​(ట్విట్టర్​) వేదికగా అభినందించారు. 

ప్రభుత్వ లక్ష్యానికి  అనుగుణంగా అధికారులు పనిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి జనగామకు దక్కిన విజయం నిదర్శనమని పేర్కొన్నారు.  దీనికి కారణమైన కలెక్టర్​రిజ్వాన్​బాషా ఆదర్శనీయుడు ప్రశంసించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల కలెక్టర్​లకు జనగామ స్ఫూర్తి కావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.  జిల్లా సాధించిన విద్యా ప్రగతి పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లను, వారిని తీర్చిదిద్దిన విద్యాశాఖ సిబ్బందిని కూడా ప్రశంసించారు.