జనగామ అర్బన్, వెలుగు: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాద నివారణల పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్చీఫ్గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌగోళికంగా జిల్లాలో నేషనల్ హై వే, ప్రధాన రహదారులు ఎక్కవ విస్తీర్ణంతో ఉన్నాయని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.
ఎవరైనా డ్రగ్స్తీసుకుంటున్నట్లు గమనిస్తే వెంటనే తమకు సమాచారం ఇస్తే వారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీటీవో శ్రీనివాస్ గౌడ్, వివిధ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతకముందు కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియంలో జెండావిష్కరణ చేశారు.
