విశాఖకు 210 కి.మీ దూరంలో జవాద్ తుపాను

విశాఖకు 210 కి.మీ దూరంలో జవాద్ తుపాను

జవాద్‌ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖకు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో, గోపాల్‌పుర్‌కు 320 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందన్నారు. ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో జవాద్‌ తుపాను పయనిస్తోందన్నారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఒడిశాలో పలు ప్రాంతాల్లో  మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. దీంతో అలర్టైన అధికారులు చర్యలు చేపట్టారు.