మెదక్టౌన్, వెలుగు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో విజయ ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ విద్యాలయంలో 2026-–27 విద్యాసంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకోసం మెదక్ జిల్లాలో మెదక్ పట్టణంలోని సిదార్థ్ మోడల్ స్కూల్(వెంకట్రావునగర్కాలనీ), సిద్ధార్థ మోడల్ హైస్కూల్(బి) వెంకట్రావునగర్ కాలనీ, గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, మెదక్లోని చిల్డ్రన్స్పార్కు వద్ద ఉన్న గీతా హైస్కూల్, నర్సాపూర్లోని ఆర్డీవో కార్యాలయం వెనక ఉన్న జడ్పీహెచ్ఎస్ బాయ్స్హైస్కూల్, రామాయంపేట పట్టణంలోని మంజీరా విద్యాలయంలో మొత్తం 6 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 1,197 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.

