ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదు : జైషా

ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదు : జైషా

ఆసియా కప్ 2023 కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ జేషా  తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ పాకిస్తాన్‌కు బదులుగా  తటస్థ వేదికపై జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మా జట్టును పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. కాబట్టి మేం దానిపై వ్యాఖ్యానించలేమని జేషా అన్నారు. 2023లో జరిగే ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగనుంది.అంతకుముందు  ఆసియా కప్‌ 2023 కోసం పాకిస్థాన్‌కు టీమిండియాను పంపించడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని జేషా ఖండించారు. 2023 ఆసియా కప్‌ పాకిస్థాన్‌లో జరగనుండగా.. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ ఇండియాలో జరగనుంది. 

గత తొమ్మిదేళ్లుగా ఇండియా, పాక్  జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇరుదేశాల మధ్య చివరి టీ20, వన్డే సిరీస్ 2012 డిసెంబర్‌లో జరిగాయి. టీ 20 సిరీస్ 1-1తో సమం కాగా, వన్డే సిరీస్‌ను పాక్‌ 2-1తో కైవసం చేసుకుంది. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత జట్టు పాక్‌లో పర్యటించలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌లో మాత్రమే ఇరుజట్లు తలపడతున్నాయి.