హైదరాబాద్, వెలుగు: నగలను దాచే సేఫ్ స్టోరేజీ సొల్యూషన్స్ను అందించే స్టీలేజ్ కంపెనీ హైదరాబాద్లో సదా తత్పర్ (ఎల్లప్పుడూ సిద్ధమే) పేరుతో క్యాంపెయిన్ నిర్వహించింది. తన ప్రొడక్టులపై కస్టమర్లకు అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఒక బ్రాండ్ఫిల్మ్ను కూడా ప్రదర్శించింది. దీనిని ఆభరణాల తయారీదారుల కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
జ్యూవలర్లు స్టీలేజీ ప్రొడక్టులను ఉపయోగించడం ద్వారా విలువైన నగలను, ఇతర ఆభరణాలను సురక్షితంగా ఉంచవచ్చని ఈ వీడియో అవగాహన కలిగిస్తుంది. ‘‘మేం 90 ఏళ్ల నుంచి ఇండియా మార్కెట్లో స్టోరేజీ ప్రొడక్టులు అమ్ముతున్నాం. కస్టమర్లను మేం ఎంత బాగా అర్థం చేసుకుంటామో చెప్పడానికే ఈ బ్రాండ్ఫిల్మ్ను తయారు చేశాం. మేం అత్యంత క్వాలిటీ హై క్యూరిటీ సేఫ్స్, స్ట్రాంగ్రూమ్డోర్స్, ఫైర్క్యాబినెట్స్, మాడ్యులర్ వాల్ట్సొల్యూషన్స్ను జ్యూయలర్లకు అందిస్తున్నాం. వీటిలో నగలను దాస్తే సురక్షితంగా ఉంటాయి’’ అని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.