బీఆర్ఎస్లో చేరిన జిన్నారం స్వతంత్ర కౌన్సిలర్

బీఆర్ఎస్లో చేరిన జిన్నారం స్వతంత్ర కౌన్సిలర్

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: జిన్నారం మున్సిపాలిటీకి చెందిన 5వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్​ శిల్పా, ఆమె భర్త నాగరాజు ఆదివారం పటాన్​చెరు పట్టణంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు.

వీరికి పార్టీ కండువా వేసి బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు​ 8మంది, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లతో కలిపి బీఆర్​ఎస్​ బలం 10కి చేరుకుంది. గూడెం మధుసూదన్​రెడ్డి పాల్గొన్నారు.