రూ. 17,800 కోట్లు సేకరించిన జియో బ్లాక్రాక్

రూ. 17,800 కోట్లు సేకరించిన జియో బ్లాక్రాక్

న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్​ఎస్​ఎల్​),  బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్ అయిన జియో బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్  తన తొలి న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్​ఎఫ్​ఓ) ద్వారా రూ.17,800 కోట్లు సేకరించినట్టు ప్రకటించింది. జియో బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్ ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ ఫండ్, జియో బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్ లిక్విడ్ ఫండ్,  జియో బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్ మనీ మార్కెట్ ఫండ్ ద్వారా ఈ డబ్బును సమీకరించారు. 

గత నెల 30న మొదలైన మూడు రోజుల ఎన్​ఎఫ్​ఓ, 90కిపైగా సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను ఆకర్షించింది. క్యాష్/డెట్​ మ్యూచువల్ ఫండ్ పథకాలకు రిటైల్ పెట్టుబడిదారుల నుంచి అద్భుత స్పందన వచ్చిందని జియో బ్లాక్​రాక్ ​తెలిపింది. ఆఫర్ కాలంలో 67 వేల మందికిపైగా ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌లలో పెట్టుబడి పెట్టారని పేర్కొంది.