
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ షేర్లు సోమవారం (ఈ నెల 21 న) మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి. అర్హులైన షేర్ హోల్డర్ల డీమాట్ అకౌంట్లలో కంపెనీ షేర్లు కిందటి వారం క్రెడిట్ అయ్యాయి. జులై 20 నాటికి రిలయన్స్ షేర్ హోల్డర్లుగా ఉన్న ఇన్వెస్టర్లకు ఒక షేరుకి ఒక జియో ఫైనాన్షియల్ షేరు ఇష్యూ చేశారు. జియో ఫైనాన్షియల్ షేర్లు ‘జియోఫిన్’ సింబల్తో మార్కెట్లో లిస్టింగ్ అవుతాయని బీఎస్ఈ ప్రకటించింది. మొదటి 10 ట్రేడింగ్ రోజుల్లో ట్రేడ్ ఫర్ ట్రేడ్ సెగ్మెంట్లో ఇవి ట్రేడవుతాయని వెల్లడించింది. అంటే ఈ షేర్లను కేవలం డెలివరీ కోసం మాత్రమే కొనడానికి వీలుంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ కుదరదు. కంపెనీ షేర్లు నిఫ్టీ50, బీఎస్ఈ సెన్సెక్స్లో ఈ నెల 24 వరకు ఉంటాయి. ఆ తర్వాత బెంచ్మార్క్ ఇండెక్స్ల నుంచి ఎగ్జిట్ అవుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ షేర్లను డీమెర్జ్ చేయడానికి, ధర నిర్ణయించడానికి జులైలో ప్రైస్ డిస్కవరీ సెషన్ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జియో ఫైనాన్షియల్ ధర రూ.261.85 గా రికార్డయ్యింది.