బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి : జోగు రామన్న

బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి :  జోగు రామన్న

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్​ ప్రకటించి అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్​ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. 

 సీఎం రేవంత్​రెడ్డి బీసీలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం ఆధీనంలో ఉందంటూ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.  సమావేశంలో నాయకులు మర్శెట్టి గోవర్ధన్,  రౌత్ మనోహర్,  మెట్టు ప్రహ్లద్, జగదీశ్ పాల్గొన్నారు.