
ఆదిలాబాద్టౌన్, వెలుగు: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా చిలుకూరి జ్యోతి రెడ్డి ని నియమించినట్లు పార్టీ జిల్లా ఇన్ చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో చిలుకూరి జ్యోతి రెడ్డిని ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు పాయల్శంకర్ సన్మానించారు.
పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.