![ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం : కె.ప్రశాంత్రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/12/k-prashanth-reddy-made-it-clear-six-guarantees-given-by-congress-party-in-election-implemented-and-fulfilled_tgRnZrEQfS.jpg)
మరికల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని తీలేరు మాజీ సర్పంచులు దివంగత వెంకారెడ్డి, వజ్రమ్మ, మాజీ ఎమ్మెల్యే కె వీరారెడ్డి జ్ఞాపకార్థం రూ.10 లక్షలతో గ్రామ స్టేజీ వద్ద నిర్మించిన కమాన్ను బుధవారం ప్రారంభించారు.
ప్రశాంత్రెడ్డి దంపతులతో పాటు సర్పంచ్ రేవతమ్మ పూజలు చేశారు. ఎంపీటీసీ సునీత, తిమ్మారెడ్డి, మల్లయ్య, రాంచంద్రయ్య, రవి, బాల్రాజ్, వెంకటేశ్, కుర్మన్న, రాము పాల్గొన్నారు.