IND vs ENG: వైజాగ్ మ్యాచ్ లో KA పాల్ హల్ చల్..ఇంగ్లాండ్ కాదు చైనా, అమెరికా లను ఓడిద్దాం

IND vs ENG: వైజాగ్ మ్యాచ్ లో KA పాల్ హల్ చల్..ఇంగ్లాండ్ కాదు చైనా, అమెరికా లను ఓడిద్దాం

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా శాంతి పార్టీ  పాల్ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి తెలియ‌ని వాళ్లు ఎవరూ ఉండరేమో. సోష‌ల్ మీడియాలో కేఏ పాల్  క్రేజ్ మామూలుగా ఉండదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి..వీరు ఏం మాట్లాడినా అది ఆసక్తికరమే. తాజాగా పాల్  వైజాగ్ క్రికెట్ స్టేడియంలలో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు జనాలతో పంచుకున్నారు. 
    
విశాఖలో నేను ఎంపీ గా పోటీ చేస్తున్నాని.. ఇక్కడ వారు నన్ను గౌరవంగా ఆహ్వానించడం జరిగిందని పాల్ అన్నారు. వైజాగ్ ను ఇంటర్నేషనల్ స్టేడియం చేసేద్దాం. లాస్ ఏంజిల్స్, దుబాయ్ కంటే బెస్ట్ సిటీని చేసేద్దాం. నన్ను గెలిపించడానికి 7569441275 నెంబర్ తో మీ వార్డ్, గ్రూప్ పెట్టి 100 ల మందిని చేర్చండి. అని పాల్ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ స్పోర్ట్స్ లో మనం నెంబర్ వన్ అవ్వాలి. చైనా, రష్యా, అమెరికాకు గట్టి పోటీని ఇవ్వాలి. మనం కేవలం క్రికెట్ లో నెంబర్ వన్. కానీ 100 స్పోర్ట్స్ లో నెంబర్ వన్ చేసే బాధ్యత నాది. స్పోర్ట్స్ యూత్ కి వేల కోట్లు ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. వాళ్ళు ఇంటర్నేషనల్ కంట్రీస్ కు పోటీదారులుగా తయారు  చేయాలి. అని పాల్ స్టేడియంలో మాట్లాడారు. 

ఈ రోజు జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే భారత్ విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ పోరాడుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్ లో జాక్ క్రాలి(29), నైట్ వాచ్ మ్యాన్ రెహన్ అహ్మద్(9) ఉన్నారు. ఇంగ్లాండ్ గెలవాలంటే మరో 332 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ భారత్ 255 పరుగులకు ఆలౌట్ కాగా.. తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. మరోవైపు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకు ఆలౌటైంది.