వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం  చేసుకోవాలి

బోధన్​,వెలుగు: రైతులు వరి కోనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం  చేసుకోవాలని కల్దుర్కి సొసైటీ సెక్రటరి ఈర్వంత్​ సూచించారు.  మంగళవారం  బోధన్​ మండలంలోని కల్దుర్కి గ్రామంలో వరికొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఏగ్రేడ్​ ధాన్యానికి రూ.2203, బీగ్రేడ్​  ధాన్యానికి రూ.2183 ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.  సోసైటీ  పరిధిలోని కల్దుర్కి, రాంపూర్​, సిద్దాపూర్, ఖండ్​గావ్​, బిక్నెల్లి, ఖండ్​గావ్​, కొప్పర్గ గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్​  ఏఈవో సాయిలు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గోన్నారు.