
అనంతపురం: 'మందు అక్రమంగా అమ్ముతున్న వాళ్ల నుంచి నువ్వు డబ్బులు వసూలు చేసుకొని నా మీద చెబుతావా.. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తావా' అంటూ కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనాభాను ఆఫీస్ బాయ్ను చెప్పుతో కొట్టారు. అయితే.. ఈ దృశ్యాలను వీడియో తీశారు. వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సదరు సీఐ ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన
— Icon Politics (@PoliticsIcon) May 17, 2025
ఉద్యోగుల వసూళ్ల పంచాయతీ అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గంలో
తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేశాడంటూ అటెండర్ను చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సీఐ హసీనా బాను..
ఈ వీడియో బయటికి రాకపోతే ఇలాంటివి ఎన్ని జరుగుతున్న నిజాలు బయటికి రావేమో pic.twitter.com/igr6xh3xvQ
ఇదే విషయంపై ఆఫీస్ బాయ్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఇటీవల ఆమెతో మాట్లాడేందుకు వచ్చారు. అదే సమయంలో ఆఫీస్ బాయ్ను సీఐ పిలిపించి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి ఎదుట చెప్పుతో కొట్టారు. ఆమె అక్రమాలపై ఓ ఉన్నతాధికారిణి విచారణ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ శాఖ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.