వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: కమల్‌

 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: కమల్‌

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్. సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న విష‌యాన్ని మాత్రం త‌ర్వాత ప్ర‌క‌టిస్తానని తెలిపారు. త‌మిళ‌నాడులో వ‌చ్చే ఏడాది మే నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.

నిన్న(ఆదివారం) మ‌ధురైలో క‌మ‌ల్‌హాస‌న్ ర్యాలీ నిర్వ‌హించారు. భారీ సంఖ్య‌లో  పార్టీ అభిమానులు ఆ ర్యాలీలో పాల్గోన్నారు. ఇటీవల ప్రధాని మోడీ కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌కు శంకుస్థాప‌న చేయ‌డాన్ని క‌మ‌ల్ త‌ప్పుప‌ట్టారు. సగం దేశం ఆక‌లి బాధ‌తో ఉంటే… కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్ అవ‌స‌ర‌మా అని  విమ‌ర్శ‌లు చేశారు.