గడువులోగా అప్లికేషన్లు పరిష్కరిస్తం : ఆశిష్ సంగ్వాన్​

గడువులోగా అప్లికేషన్లు పరిష్కరిస్తం : ఆశిష్ సంగ్వాన్​
  • కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్​, వెలుగు : ‘భూభారతి’ పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట మండలంలో భూ సమస్యలపై 4,225 అప్లికేషన్లు వచ్చాయని, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  శుక్రవారం రాష్ర్ట రెవెన్యూ, హౌజింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి,  సీఎస్​ రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్​ నవీన్​మిట్టల్ భూభారతి రెవెన్యూ సదస్సులు, నీట్​ పరీక్ష,  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై  కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్​ కలెక్టర్లు వి.విక్టర్​, చందర్​నాయక్​,  ఆర్డీవో ప్రభాకర్,  హౌజింగ్ పీడీ జయపాల్​రెడ్డి,  ‘భూభారతి’ స్పెషల్ ఆఫీసర్ రాజేందర్, లింగంపేట తహసీల్దార్ సురేశ్​ తదితరులు​ పాల్గొన్నారు. 

సెక్రటరీలకు రెండు రోజుల ట్రైనింగ్​ 

పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చే ట్రైనింగ్​ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం,  గ్రామసభ నిర్వహణ తదితర ఆంశాలపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది.   ట్రైనింగ్​లో నేర్చుకున్న అంశాలు పక్కగా అమలయ్యేలా చూడాలన్నారు.   పలు అంశాలపై రిసోర్స్ పర్సన్లు వివరించారు. అడిషనల్ కలెక్టర్​ చందర్​ నాయక్​, డీపీవో మురళీ, డీఎల్పీవో శ్రీనివాస్,  ట్రైనింగ్​ అధికారులు రాజేందర్,  సవిత,  కిషన్ తదితరుల పాల్గొన్నారు.