- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్సూచించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో సెంట్రింగ్ యూనిట్ వర్క్ కోసం లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 32 మందికి సోమవారం కలెక్టర్ సర్టిఫికెట్లు అందించారు.
అనంతరం మాట్లాడుతూ..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్ అయ్యేందుకు సెంట్రింగ్ సేవలు అత్యంత అవసరమన్నారు. సెంట్రింగ్ యూనిట్ల స్థాపనలకు లబ్ధిదారులకు సబ్సీడితో పాటు, బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించాలని అధికారులకు సూచించారు. డీఆర్డీవో సురేందర్, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, ఏపీఎం రాజేందర్ పాల్గొన్నారు.
